హజ్ మోసాలపై సౌదీ అరేబియా హెచ్చరిక
- June 09, 2022
జెడ్డా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, సోషల్ మీడియా వేదికగా హజ్ సేవలకు సంబంధించి జరిగే మోసాలపై యాత్రీకులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ ధరలకే హజ్ యాత్ర.. అంటూ జరిగే ప్రచారాల్ని విశ్వసించరాదని సూచించింది. పలు ఫేక్ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా యాత్రీకుల్ని మోసం చేస్తున్నారంటూ మినిస్ట్రీ హెచ్చరించింది. వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారారన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారిక వ్యక్తులకు ఇవ్వకూడదని పేర్కొంది.తమ అధికారిక యాప్ ఈత్మర్నా అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే హజ్ మరియు ఉమ్రా సేవలు పొందవచ్చు. మోసాలకు పాల్పడే వ్యక్తులు, సోషల్ మీడియా అక్కౌంట్లపై సమాచారాన్ని సంబంధిత అథారిటీస్కి అందించాలని కోరింది మినిస్ట్రీ. ఈ ఏడాది సుమారుగా 1 మిలియన్ యాత్రీకుల్ని అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక