హజ్ మోసాలపై సౌదీ అరేబియా హెచ్చరిక

- June 09, 2022 , by Maagulf
హజ్ మోసాలపై సౌదీ అరేబియా హెచ్చరిక

జెడ్డా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, సోషల్ మీడియా వేదికగా హజ్ సేవలకు సంబంధించి జరిగే మోసాలపై యాత్రీకులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ ధరలకే హజ్ యాత్ర.. అంటూ జరిగే ప్రచారాల్ని విశ్వసించరాదని సూచించింది. పలు ఫేక్ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా యాత్రీకుల్ని మోసం చేస్తున్నారంటూ మినిస్ట్రీ హెచ్చరించింది. వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారారన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారిక వ్యక్తులకు ఇవ్వకూడదని పేర్కొంది.తమ అధికారిక యాప్ ఈత్మర్నా అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే హజ్ మరియు ఉమ్రా సేవలు పొందవచ్చు. మోసాలకు పాల్పడే వ్యక్తులు, సోషల్ మీడియా అక్కౌంట్లపై సమాచారాన్ని సంబంధిత అథారిటీస్‌కి అందించాలని కోరింది మినిస్ట్రీ. ఈ ఏడాది సుమారుగా 1 మిలియన్ యాత్రీకుల్ని అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com