హజ్ మోసాలపై సౌదీ అరేబియా హెచ్చరిక
- June 09, 2022
జెడ్డా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, సోషల్ మీడియా వేదికగా హజ్ సేవలకు సంబంధించి జరిగే మోసాలపై యాత్రీకులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ ధరలకే హజ్ యాత్ర.. అంటూ జరిగే ప్రచారాల్ని విశ్వసించరాదని సూచించింది. పలు ఫేక్ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా యాత్రీకుల్ని మోసం చేస్తున్నారంటూ మినిస్ట్రీ హెచ్చరించింది. వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారారన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారిక వ్యక్తులకు ఇవ్వకూడదని పేర్కొంది.తమ అధికారిక యాప్ ఈత్మర్నా అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే హజ్ మరియు ఉమ్రా సేవలు పొందవచ్చు. మోసాలకు పాల్పడే వ్యక్తులు, సోషల్ మీడియా అక్కౌంట్లపై సమాచారాన్ని సంబంధిత అథారిటీస్కి అందించాలని కోరింది మినిస్ట్రీ. ఈ ఏడాది సుమారుగా 1 మిలియన్ యాత్రీకుల్ని అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







