భారత్ కరోనా అప్డేట్
- June 12, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల క్రితం వరకు రోజుకు రెండు వేలకే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు ఎనిమిది వేలకు చేరుకున్నాయి. శనివారం ఒక్కరోజే 8,582 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది వేల కేసులు దాటడం ఇది వరుసగా రెండో రోజు. శనివారం నలుగురు మరణించారు. ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 2,922 కేసులు నమోదయ్యాయి.
ఒక్కరు మరణించారు. ఢిల్లీలో 795, కర్ణాటకలో 562, చత్తీస్ఘడ్లో 27, ఒడిశాలో 24 కేసులు నమోదయ్యాయి. ఈ వారం దాదాపు 20 వేల కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కోవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







