లగేజీ నష్టానికి విమానయాన సంస్థలదే బాధ్యత: సౌదీ
- June 13, 2022
సౌదీ: ప్రయాణీకుల లగేజీని ఆలస్యం చేసినా, పోగొట్టినా లేదా పాడైపోయినా ఎయిర్ క్యారియర్లు పరిహారం చెల్లించాలని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) స్పష్టం చేసింది. ప్రయాణ టిక్కెట్ను కలిగి ఉన్న ప్రతి కస్టమర్కు విమాన క్యారియర్ తప్పనిసరిగా కనీసం SR1,820తో పరిహారం అందజేయాలని ఆదేశించింది. అలాగే లగేజీ నష్టం, ఆలస్యం కోసం SR6,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ లగేజీలో విలువైన లేదా అధిక-విలువైన వస్తువులు ఉంటే విమానం ఎక్కే ముందు వాటి గురించిన సమాచారాన్ని ఎయిర్ క్యారియర్కు తెలియజేయాలని జీఏసీఏ సూచించింది. కస్టమర్ల లగేజీ ఆలస్యమైన సందర్భంలో తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని, ఆలస్యమయ్యే ప్రతి రోజు SR104కి సమానంగా చెల్లించాలని పేర్కొంది. దేశీయ విమానాలకు గరిష్టంగా SR520 పరిహారంగా నిర్ణయించారు. అంతర్జాతీయ విమానాల విషయానికొస్తే.. ఆలస్యమైన ప్రతి రోజు కస్టమర్లకు SR208కి సమానమైన పరిహారం చెల్లించాలని జీఏసీఏ ఆదేశించింది. నష్టపరిహారం క్లెయిమ్ను స్వీకరించిన తేదీ నుండి 30 రోజులలోపు కస్టమర్కు లగేజీ నష్టానికి ఎయిర్ క్యారియర్ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







