తెలంగాణ కరోనా అప్డేట్
- June 15, 2022
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205 మందికి కొత్తగా కొవిడ్ సోకింది. 21,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్యాధికారులు నిర్వహించారు. అయితే కొవిడ్ చికిత్స పొందుతున్న 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 99.31శాతం ఉంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే 132 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో మూడు, అదిలాబాద్, నల్గొండ, పెద్దపల్లి, యాద్రాద్రి భవనగిరి జిల్లాలో రెండు చొప్పున, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,401కి చేరింది. కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరు ఎవరికివారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







