తెలంగాణ కరోనా అప్డేట్
- June 15, 2022
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205 మందికి కొత్తగా కొవిడ్ సోకింది. 21,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్యాధికారులు నిర్వహించారు. అయితే కొవిడ్ చికిత్స పొందుతున్న 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 99.31శాతం ఉంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే 132 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో మూడు, అదిలాబాద్, నల్గొండ, పెద్దపల్లి, యాద్రాద్రి భవనగిరి జిల్లాలో రెండు చొప్పున, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,401కి చేరింది. కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరు ఎవరికివారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







