'గంధర్వ' జూలై 1న విడుదల
- June 15, 2022
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న తాజా చిత్రం గంధర్వ.ఇంతవరకు చిత్ర పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని ఒక అనూహ్యమైన కథాంశంతో రూపొంది సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు సెన్సార్ వారి అభినందనలు కూడా అందుకుంది గంధర్వ.యాంటి ఏజింగ్ అనే ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకొని అద్భుతమైన ప్రజెంటేషన్ తో తెరకెక్కిన గంధర్వ సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి.ఏవో ఒకటి రెండు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి కట్స్ చెప్పకుండా యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు చిత్ర దర్శకుడు అఫ్సర్ ను అభినందించారు సెన్సార్ సభ్యులు. వంగవీటి,జార్జ్ రెడ్డి ఫేం సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి అర్.సురేష్ హీరోయిన్గా సాయికుమార్,సీనియర్ హీరో సురేష్,బాబు మోహన్,పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్,కెమెరా : జవహర్ రెడ్డి,ఎడిటింగ్ : బసవరాజు.కాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్,నిర్మాత,పంపిణీదారుడు సురేష్ కొండేటి వెంటనే హక్కులు సొంతం చేసుకొని తన ఎస్. కె. ఫిలిమ్స్ బ్యానర్ పై ఉభయ తెలుగు రాష్ట్రాలలో జూలై 1న భారీ స్థాయిలో రిలీజ్ చేయటానికి ముందుకు రావడం విశేషం.కాగా ఒక కొత్త దర్శకుడు రూపొందించిన గంధర్వ చిత్రం రిలీజ్ కు ముందే విపరీతమైన మౌత్ టాక్ సొంతం చేసుకొని ఒకే ఒక్క షో తో బిజినెస్ క్లోజ్ చేసుకోవటం గురించి ఇండస్ట్రీలో విశేషంగా చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







