'గంధర్వ' జూలై 1న విడుదల
- June 15, 2022
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న తాజా చిత్రం గంధర్వ.ఇంతవరకు చిత్ర పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని ఒక అనూహ్యమైన కథాంశంతో రూపొంది సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు సెన్సార్ వారి అభినందనలు కూడా అందుకుంది గంధర్వ.యాంటి ఏజింగ్ అనే ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకొని అద్భుతమైన ప్రజెంటేషన్ తో తెరకెక్కిన గంధర్వ సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి.ఏవో ఒకటి రెండు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి కట్స్ చెప్పకుండా యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు చిత్ర దర్శకుడు అఫ్సర్ ను అభినందించారు సెన్సార్ సభ్యులు. వంగవీటి,జార్జ్ రెడ్డి ఫేం సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి అర్.సురేష్ హీరోయిన్గా సాయికుమార్,సీనియర్ హీరో సురేష్,బాబు మోహన్,పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్,కెమెరా : జవహర్ రెడ్డి,ఎడిటింగ్ : బసవరాజు.కాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్,నిర్మాత,పంపిణీదారుడు సురేష్ కొండేటి వెంటనే హక్కులు సొంతం చేసుకొని తన ఎస్. కె. ఫిలిమ్స్ బ్యానర్ పై ఉభయ తెలుగు రాష్ట్రాలలో జూలై 1న భారీ స్థాయిలో రిలీజ్ చేయటానికి ముందుకు రావడం విశేషం.కాగా ఒక కొత్త దర్శకుడు రూపొందించిన గంధర్వ చిత్రం రిలీజ్ కు ముందే విపరీతమైన మౌత్ టాక్ సొంతం చేసుకొని ఒకే ఒక్క షో తో బిజినెస్ క్లోజ్ చేసుకోవటం గురించి ఇండస్ట్రీలో విశేషంగా చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







