శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- June 17, 2022 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.28.52లక్షల విలువైన 554.20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రయాణికుడు విమానాశ్రయం వీఏఆర్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ద్వారా ఈ బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసేందుకు యత్నించాడు. గాజులు, గొలుసులు, బిస్కెట్ల రూపంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com