మలేసియా లో 'ఉగాది' వేడుకలు
- April 10, 2016
అన్నింటిలో కలిసి పోయే గుణాలు తెలుగు భాషలో ఉన్నాయని, తెలుగు వాళ్లం కలిసే ఉంటామని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. తెలుగు భాష గొప్పదని ఆమె అన్నారు. శనివారం మలేసియాలోని కౌలాలంపూర్లో మలేసియా తెలుగు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను కవిత రూపంలో వినిపించారు. మలేసియాలోని తెలుగువారందరికీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది అంటే ఒక యుగాన్ని ప్రారంభించిన రోజని, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉగాది పండుగ రోజు రెండు విషయాలను మరచిపోరన్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం, మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేయడం రెండోది అని చెప్పారు. తెలుగు రాష్ట్రం విడిపోయినా, రెండు రాష్ట్రాల్లో విజన్ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారని, వారి సహకారంతో తెలుగుతనాన్ని కాపాడుకుందామన్నారు. మలేసియా ప్రభుత్వం చొరవ చూపి తెలుగువారి పండుగను ఘనంగా నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. తెలుగు సినిమాల్లో విలువలు పడిపోతున్నాయని, ఇంగ్లీషు పదాలను ఎక్కువగా వాడుతున్నారన్నారు. 150 సంవత్సరాల క్రితం మలేసియాకు వచ్చిన వారు చిన్న సంఘాలు పెట్టుకుని భజనలు, కీర్తనలు చెప్పుకుని, పాటలు పాడుకుంటూ బడులు పెట్టుకుని మన భాషను బతికించుకున్నారన్నారు.
Dailyhunt
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









