మలేసియా లో 'ఉగాది' వేడుకలు
- April 10, 2016
అన్నింటిలో కలిసి పోయే గుణాలు తెలుగు భాషలో ఉన్నాయని, తెలుగు వాళ్లం కలిసే ఉంటామని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. తెలుగు భాష గొప్పదని ఆమె అన్నారు. శనివారం మలేసియాలోని కౌలాలంపూర్లో మలేసియా తెలుగు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను కవిత రూపంలో వినిపించారు. మలేసియాలోని తెలుగువారందరికీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది అంటే ఒక యుగాన్ని ప్రారంభించిన రోజని, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉగాది పండుగ రోజు రెండు విషయాలను మరచిపోరన్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం, మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేయడం రెండోది అని చెప్పారు. తెలుగు రాష్ట్రం విడిపోయినా, రెండు రాష్ట్రాల్లో విజన్ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారని, వారి సహకారంతో తెలుగుతనాన్ని కాపాడుకుందామన్నారు. మలేసియా ప్రభుత్వం చొరవ చూపి తెలుగువారి పండుగను ఘనంగా నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. తెలుగు సినిమాల్లో విలువలు పడిపోతున్నాయని, ఇంగ్లీషు పదాలను ఎక్కువగా వాడుతున్నారన్నారు. 150 సంవత్సరాల క్రితం మలేసియాకు వచ్చిన వారు చిన్న సంఘాలు పెట్టుకుని భజనలు, కీర్తనలు చెప్పుకుని, పాటలు పాడుకుంటూ బడులు పెట్టుకుని మన భాషను బతికించుకున్నారన్నారు.
Dailyhunt
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









