యూఏఈ: కొత్త కొవిడ్ ఆంక్షల వివరాలు...
- June 18, 2022
యూఏఈలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కొత్త కొవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.నివాసితులు,యూఏఈకి వెళ్లే ప్రయాణికులు కూడా తెలుసుకోవాల్సిన వివరాలు.
గ్రీన్పాస్ల కాల పరిమితి కుదింపు
రెండు డోసుల కొవిడ్ తీసుకున్న ప్రజలకు గతంలో 30 రోజుల కాల పరిమితితో కూడిన గ్రీన్పాస్లను యాప్ ద్వారా అందించేవారు. అయితే కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. గ్రీన్ పాస్ గడువును 14 రోజులకు కుదించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బిల్డింగ్లలోకి ప్రవేశానికి గ్రీన్పాస్లు తప్పనిసరి.
మాస్క్ తప్పనిసరి
యూఏఈలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం అనేది మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.అయితే.. ఇన్డోర్ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ తప్పనిసరి.ఎవరైనా మాస్క్ ధరించనట్లైతే.. 3000 దిర్హాములు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
10 రోజుల ఐసోలేషన్
కొవిడ్ లక్షణాలతో సంబంధం లేకుండా.. కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరూ 10 రోజులపాటు ఐసోలేషన్లోకి వెళ్లాలి. రెసిడెంట్లు అందరూ కొవిడ్-19 డీఎక్స్బీ స్మార్ట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
యూఏఈ వెళ్లే ప్రయాణికులు
యూఏఈకి వెళ్లే ప్రయాణికులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా పొంది ఉండాలి.కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్పై క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు ప్రయాణానికి 48 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ను పొంది ఉండాలి.ఈ సర్టిఫికెట్పై కూడా క్యూఆర్ కోడ్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







