కార్మికులకు జీతాల వివాదాల పరిష్కారానికి కొత్త కమిటీ
- June 21, 2022
యూఏఈ: యజమానులు, కార్మికుల మధ్య ఆర్థిక వివాదాలను పరిష్కారానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన కార్మికుల ఆర్థిక హక్కులకు సంబంధించిన సామూహిక కార్మిక వివాదాలను ఈ కమిటీ పరిశీలించనుంది. కార్మిక సంబంధాలను నియంత్రించే చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా కార్మిక వివాదాల శాసన, సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే ఫ్రేమ్వర్క్ లో కమిటీని ఏర్పాటు చేసినట్లు మానవ వనరుల వ్యవహారాల తాత్కాలిక అండర్ సెక్రటరీ ఖలీల్ ఖౌరీ చెప్పారు. MoHRE అధ్యక్షతన ఉండే ఈ కమిటీలో అప్పీల్ కోర్టు న్యాయమూర్తి, వాణిజ్య-పరిశ్రమల మండలి ప్రతినిధి, స్థానిక లేబర్ కమిటీ లేదా లేబర్ క్రైసిస్ టీమ్ నుండి ఒక ప్రతినిధితో సహా సంబంధిత అధికారుల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఫిర్యాదు అందిన 30 రోజుల్లో పరిష్కారం చూపేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని ఖౌరీ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







