హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2022
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్యాసింజర్ టెర్మినల్ భవనం తూర్పు భాగంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విమానాశ్రయ ఉద్యోగులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, రక్ష సిబ్బంది పాల్గొన్నారు. సుమారు గంట పాటు ఈ యోగా కార్యక్రమం కొనసాగింది. జేపీ యోగా వెల్ నెస్ కన్సల్టింగ్ కు చెందిన యోగా శిక్షకుడు జయప్రకాశ్ నంబూరు పర్యవేక్షణలో దీనిని నిర్వహించారు.ఆసక్తి కలిగిన కొందరు ప్రయాణికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రాణాయామం, వృక్షాసనం, భుజంగాసనం, శీర్షాసనం వంటి వివిధ ఆసనాలను ప్రదర్శించారు.
యోగా ఒక సుస్థిర జీవన విధానాన్ని బోధిస్తుంది.నేడు ప్రపంచమంతటా శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగాను అనుసరిస్తున్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమ ఉద్యోగులు వివిధ యోగా కోర్సులు, ఆన్లైన్ సెషన్లు నిర్వహిస్తుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినాన్ని గుర్తిస్తోంది. మొదటి అంతర్జాతీయ యోగా దినాన్ని జూన్ 21 2015న జరుపుకున్నారు.
_1655802382.jpg)

తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







