అదానీ 60వ పుట్టిన రోజు..భారీ విరాళం
- June 23, 2022
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.అదానీ, అతడి కుటుంబం కలిసి రూ.60 వేల కోట్లు సమాజ సేవకు వెచ్చించనున్నట్లు ప్రకటించారు.ఈ భారీ విరాళాన్ని అదానీ ఫౌండేషన్ నిర్వహిస్తుందని ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు.
విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తన తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ అదానీ చెప్పారు. ‘‘శుక్రవారం నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా కుటుంబం కలిసి రూ.60 వేల కోట్లు సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. భారత దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విరాళం. విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తాం. ఈ నిధుల కేటాయింపు, వ్యయం వంటి అంశాలకు తుదిరూపు ఇవ్వడానికి నిపుణులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీల్లో నా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు’’ అని అదానీ వెల్లడించారు.
వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల విక్రయ సంస్థగా 1988లో అదానీ గ్రూపు ప్రారంభమైంది. చిన్న వ్యాపార సంస్థగా మొదలై, ఇప్పుడు అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది.తాజా విరాళం ప్రకటనతో అదానీ.. మార్క్ జుకర్ బర్గ్, వారెన్ బఫెట్ వంటి భారీ విరాళాలు ప్రకటించిన వారి సరసన చేరారు. బ్లూమ్బర్గ్ సంస్థ తాజా అంచనా ప్రకారం అదానీ సంపద విలువ 92 బిలియన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







