పెను ప్రమాదం నుండి బయటపడ్డ సీఎం యోగి
- June 26, 2022
ఉత్తర్ ప్రదేశ్: యూపీ సీఎం యోగి పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు.ఆదివారం ఆయన వారాణాసి నుంచి లఖ్నవూకు వెళుతుండగా ఓ పక్షి హెలికాప్టర్ను ఢీకొట్టింది. దీంతో టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకునే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్రాజ్ శర్మ తెలిపారు. ల్యాండ్ చేసిన అనంతరం యోగి సర్కూట్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత బబత్పుర్ విమానాశ్రయం నుంచి విమాన మార్గంలో లఖ్నవూ బయలుదేరారు.
కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారాణాసి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేసిన యోగి.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం అభివృద్ధి పనులను పర్యవేక్షించి 9 గంటలకు లఖ్నవూకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







