యూఏఈ చేరుకున్న భారత ప్రధాని మోడీ..
- June 28, 2022అబుధాబి: ఒక రోజు పర్యటన నిమిత్తం నేడు యూఏఈ రాజధాని అబుధాబి విచ్చేసారు భారత ప్రధాని మోడీ. మోడీ కు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికి సాదరంగా ఆలింగనం చేసుకున్నారు అబుధాబి రాజు షేక్ మొహమ్మద్. మోడీ కు భారత రాయబారి సంజయ్ సుధీర్ మరియు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.
దివగంత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా మృతిపట్ల నూతన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ కు సంతాపం తెలియజేయనున్న మోడీ. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు సైతం తెలియజేయనున్న మోడీ.
షేక్ మొహమ్మద్ తో రాజకుటుంబానికి చెందిన ఇతర సీనియర్ సభ్యులు మోడీతో ఇరు దేశాల దౌత్య సంబంధాలను చర్చించుటకు హాజయ్యారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేసిన తదుపరి ఇదే మోడీ తొలి పర్యటన. షేక్ మొహమ్మద్ మరియు మోడీ ప్రత్యక్షంగా జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ఐదు సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $115 బిలియన్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా, యూఏఈ యొక్క అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా భారతదేశం తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..