వంశీ-శుభోదయం పురస్కారాలు..
- June 28, 2022హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వంశీ ఆర్ట్ థియేటర్స్, శ్రీ త్యాగరాయ గాన సభ- శుభోదయం సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాద్ నందు, తెలంగాణ ప్రభుత్వాధికార ప్రతినిధి, న్యూఢిల్లీ, డాక్టర్ వేణుగోపాలాచారి వంశీ శుభోదయం పురస్కారాలను ప్రధానం చేశారు.
వంశీ శుభోదయం తెలుగు తేజం ప్రవాస భారతీయ పురస్కారాలు మల్లికేశ్వరరావు కొంచాడ, సంపాదకులు, తెలుగు మల్లి, మెల్బోర్న్ ఆస్ట్రేలియా మరియు రాజేష్ యక్కలి, సీఈఓ, స్వర మీడియా, అమెరికా అందుకున్నారు.
వంశీ శుభోదయం సంగీత పురస్కారాలు ప్రముఖ సంగీత విద్వాంసులు, అసిస్టెంట్ డైరెక్టర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చౌటి రఘునందన్,వంశీ-శుభోదయం ఆధ్యాత్మిక పురస్కారం కంచర్ల గోపన్న వారసులు కంచర్ల వెంకట రమణ, వంశీ శుభోదయం సాహితీ పురస్కారం శ్రీనాధ కవి వారసులు డా.కావూరు శ్రీనివాస్అందుకున్నారు.
ప్రముఖ సంగీత విద్వాంసురాలు అంగర లక్ష్మి గారి దివ్య స్మృతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు చౌటి రఘునందన్ కర్ణాటక సంగీత గాత్ర కచేరి సమర్పించారు.. మృదంగం పై భీమశంకర్, అసిస్టెంట్ లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్,కీ బోర్డుపై శ్రీనివాస్ యాదవ్,తబలా పై జయ కుమార్ ఆచారి సహకరించారు..
ఈ కార్యక్రమానికి వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు అధ్యక్షులుగా వ్యవహరించారు.వ్యాఖ్యాత్రిగా షామీర్ జానకీదేవి, ప్రత్యేక అతిథిగా అంగర లక్ష్మీ కుమార్తె ఉషశ్రీ, వంశీ మేనేజింగ్ ట్రస్టీ, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..