భారత్ కరోనా అప్డేట్
- June 29, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం నమోదైన కేసుల సంఖ్యను బట్టి యాక్టివ్ కేసుల లక్షకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14వేల 506 కొత్త కేసులు నమోదు కారణంగా 30 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 99వేల 602కు చేరాయి. రోజువారీ పాజిటివిటి రేటు 3.35 శాతానికి చేరగా.. దేశ జనాభాలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.23 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 34లక్షల 33వేల 345కేసులు కాగా 5లక్షల 25వేల 77మరణాలు నమోదైనట్లు సమాచారం.
కరోనా రికవరీ రేటు దేశంలో 98.56 శాతంగా ఉండగా.. మంగళవారం ఒక్కరోజే 11వేల 574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారు 4కోట్ల 28లక్షల 8వేల 666 మందిగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 530 రోజులకు చేరింది. ఇప్పటివరకు 197.46 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం ఒక్కరోజులో 13లక్షల 44వేల 788 డోసుల టీకాలు అందజేశారు. మొత్తంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 197కోట్ల 46లక్షల 57వేల 138 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన