యూఏఈ దిర్హామ్ తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో పతనమైన ఇండియన్ రూపాయి
- June 29, 2022
యూఏఈ: విదేశీ నిధులు ప్రవాహం కారణంగా మదుపరులు తమ సెంటిమెంట్స్ ను గౌరవిస్తూ పెట్టుబడులు ఉపసంహరణ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి రూ. 78.59 కు చేరుకుంది.
మార్కెట్ ప్రారంభ సమయానికి అమెరికన్ డాలర్ (వయా యూఏఈ దిర్హామ్) తో పోలిస్తే రూపాయి మారకం 78.53 వద్ద ఉండగా మార్కెట్ ముగిసే నాటికి 22 పైసలు క్షీణించి 78.59 వద్ద ఆగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కావడం గురించి మెహతా ఈక్విటీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ రష్యా పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుదల మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల కరెన్సీ ల పై ఒత్తిడి పెంచేందుకు దోహదపడతాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటుగా దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐ ల నిరంతర విక్రయాలు కూడా రూపాయి పై ఒత్తిడి పెంచుతున్నాయి అని పేర్కొన్నారు.
ఈ వారం మొత్తం రూపాయి విలువ అస్థిరంగా ఉండటంతో పాటు ప్రస్తుత మారకం స్థాయిని సైతం దాటవచ్చని మేము భావిస్తున్నాం అని రాహుల్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







