యూఏఈ దిర్హామ్ తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో పతనమైన ఇండియన్ రూపాయి
- June 29, 2022
యూఏఈ: విదేశీ నిధులు ప్రవాహం కారణంగా మదుపరులు తమ సెంటిమెంట్స్ ను గౌరవిస్తూ పెట్టుబడులు ఉపసంహరణ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి రూ. 78.59 కు చేరుకుంది.
మార్కెట్ ప్రారంభ సమయానికి అమెరికన్ డాలర్ (వయా యూఏఈ దిర్హామ్) తో పోలిస్తే రూపాయి మారకం 78.53 వద్ద ఉండగా మార్కెట్ ముగిసే నాటికి 22 పైసలు క్షీణించి 78.59 వద్ద ఆగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కావడం గురించి మెహతా ఈక్విటీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ రష్యా పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుదల మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల కరెన్సీ ల పై ఒత్తిడి పెంచేందుకు దోహదపడతాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటుగా దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐ ల నిరంతర విక్రయాలు కూడా రూపాయి పై ఒత్తిడి పెంచుతున్నాయి అని పేర్కొన్నారు.
ఈ వారం మొత్తం రూపాయి విలువ అస్థిరంగా ఉండటంతో పాటు ప్రస్తుత మారకం స్థాయిని సైతం దాటవచ్చని మేము భావిస్తున్నాం అని రాహుల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







