యూఏఈ దిర్హామ్ తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో పతనమైన ఇండియన్ రూపాయి
- June 29, 2022
యూఏఈ: విదేశీ నిధులు ప్రవాహం కారణంగా మదుపరులు తమ సెంటిమెంట్స్ ను గౌరవిస్తూ పెట్టుబడులు ఉపసంహరణ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి రూ. 78.59 కు చేరుకుంది.
మార్కెట్ ప్రారంభ సమయానికి అమెరికన్ డాలర్ (వయా యూఏఈ దిర్హామ్) తో పోలిస్తే రూపాయి మారకం 78.53 వద్ద ఉండగా మార్కెట్ ముగిసే నాటికి 22 పైసలు క్షీణించి 78.59 వద్ద ఆగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కావడం గురించి మెహతా ఈక్విటీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ రష్యా పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుదల మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల కరెన్సీ ల పై ఒత్తిడి పెంచేందుకు దోహదపడతాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటుగా దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐ ల నిరంతర విక్రయాలు కూడా రూపాయి పై ఒత్తిడి పెంచుతున్నాయి అని పేర్కొన్నారు.
ఈ వారం మొత్తం రూపాయి విలువ అస్థిరంగా ఉండటంతో పాటు ప్రస్తుత మారకం స్థాయిని సైతం దాటవచ్చని మేము భావిస్తున్నాం అని రాహుల్ చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







