కేంద్రం హామీతో బంగారం వర్తకులు బంద్ ముగిసింది..
- April 12, 2016
కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నును వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వారాలుగా బంగారం వర్తకులు చేస్తున్న బంద్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో దేశంలో సగానికి పైగా బంగారు దుకాణాలు తెరుచుకున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి బంగారు వర్తకులకు వేధింపులు లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో తమ బంద్ ను ఆపివేశామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్ రాజ్ బమాల్వ తెలిపారు.ఆరు వారాల తర్వాత తెరుచుకున్నా షాపుల్లో బంగారు డిసౌంట్స్ పడిపోతున్నాయి. 40 డాలర్లుగా ఉన్న బంగారు డిసౌంట్స్ ను డీలర్లు 25 డాలర్లకు ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు ఇది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోందని ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు.బంగారు దుకాణాల బంద్, ధరలు ఎక్కువగా ఉండటంతో మార్చి క్వార్టర్ లో గోల్డ్ కొనుగోలు తగ్గాయని, ఏడు ఏళ్ల కనిష్టానికి పడిపోయాయని పేర్కొన్నారు. ఈ వారాంతం వరకు అన్ని బంగారు దుకాణాలు తెరుచుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









