హజ్ సేవల్లో నిర్లక్ష్యం.. ఉన్నతాధికారులపై వేటు
- July 08, 2022
రియాద్: హజ్ సేవల్లో నిర్లక్ష్యం చూపిన ఓ ఉన్నతాధికారులను తొలగించినట్లు సౌదీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది తీర్థయాత్ర కోసం సేవలను నిర్వహిస్తున్న హజ్ కంపెనీలలో ఒకదాని చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఒక ఉన్నత అధికారిని తొలగించినట్లు హజ్కు బాధ్యత వహించే సౌదీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాత్రికులకు తగిన సేవలను అందించడంలో విఫలమైనందున వారిని తొలగించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ఫీల్డ్ టీమ్ల పరిశీలనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. తొలగించిన ఇద్దరు అధికారులపై తదుపరి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యాత్రికులు హజ్ లో పాల్గొంటారని, యాత్రికుల భద్రత, సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం చూపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









