హజ్ సేవల్లో నిర్లక్ష్యం.. ఉన్నతాధికారులపై వేటు
- July 08, 2022
రియాద్: హజ్ సేవల్లో నిర్లక్ష్యం చూపిన ఓ ఉన్నతాధికారులను తొలగించినట్లు సౌదీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది తీర్థయాత్ర కోసం సేవలను నిర్వహిస్తున్న హజ్ కంపెనీలలో ఒకదాని చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఒక ఉన్నత అధికారిని తొలగించినట్లు హజ్కు బాధ్యత వహించే సౌదీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాత్రికులకు తగిన సేవలను అందించడంలో విఫలమైనందున వారిని తొలగించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ఫీల్డ్ టీమ్ల పరిశీలనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. తొలగించిన ఇద్దరు అధికారులపై తదుపరి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యాత్రికులు హజ్ లో పాల్గొంటారని, యాత్రికుల భద్రత, సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం చూపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







