బిజినెస్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు సెలవులు
- July 08, 2022
యూఏఈ: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఒక సంవత్సరం వరకు సెలవు తీసుకోవచ్చని యూఏఈ ప్రకటించింది. ఎమిరాటీలు తమ ప్రభుత్వ ఉద్యోగాలను కొనసాగిస్తూనే సెలవు తీసుకోవచ్చని పేర్కొంది. సెలవుల కాలంలో సగం జీతాలను పొందుతారని తెలిపింది. పౌరులు వ్యాపారాలు చేసే దిశగా సాగేలా ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యమని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. భారీ వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా యువతను ప్రోత్సహించడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని షేక్ మహ్మద్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. చమురుయేతర ఎగుమతుల్లో దేశం 47 శాతం వృద్ధిని.. విదేశీ పెట్టుబడుల్లో 16 శాతం పెరుగుదల, కొత్త కంపెనీల సంఖ్య 126 శాతం పెరిగిందని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ









