బిజినెస్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు సెలవులు
- July 08, 2022
యూఏఈ: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఒక సంవత్సరం వరకు సెలవు తీసుకోవచ్చని యూఏఈ ప్రకటించింది. ఎమిరాటీలు తమ ప్రభుత్వ ఉద్యోగాలను కొనసాగిస్తూనే సెలవు తీసుకోవచ్చని పేర్కొంది. సెలవుల కాలంలో సగం జీతాలను పొందుతారని తెలిపింది. పౌరులు వ్యాపారాలు చేసే దిశగా సాగేలా ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యమని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. భారీ వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా యువతను ప్రోత్సహించడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని షేక్ మహ్మద్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. చమురుయేతర ఎగుమతుల్లో దేశం 47 శాతం వృద్ధిని.. విదేశీ పెట్టుబడుల్లో 16 శాతం పెరుగుదల, కొత్త కంపెనీల సంఖ్య 126 శాతం పెరిగిందని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







