భారత్ కరోనా అప్డేట్
- July 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతంగా నమోదైందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,50,434గా ఉందని పేర్కొంది.
వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 5,07,360 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని వివరించింది. ఇప్పటివరకు 87.11 కోట్ల పరీక్షలు చేశారని పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 29,12,855 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. కాగా, కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులు వాడడాన్ని తప్పనిసరి చేశాయి.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









