భారత్ కరోనా అప్డేట్
- July 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతంగా నమోదైందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,50,434గా ఉందని పేర్కొంది.
వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 5,07,360 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని వివరించింది. ఇప్పటివరకు 87.11 కోట్ల పరీక్షలు చేశారని పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 29,12,855 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. కాగా, కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులు వాడడాన్ని తప్పనిసరి చేశాయి.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









