భారత్ కరోనా అప్డేట్
- July 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతంగా నమోదైందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,50,434గా ఉందని పేర్కొంది.
వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 5,07,360 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని వివరించింది. ఇప్పటివరకు 87.11 కోట్ల పరీక్షలు చేశారని పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 29,12,855 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. కాగా, కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులు వాడడాన్ని తప్పనిసరి చేశాయి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..







