భారత్ కరోనా అప్డేట్
- July 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతంగా నమోదైందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,50,434గా ఉందని పేర్కొంది.
వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 5,07,360 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని వివరించింది. ఇప్పటివరకు 87.11 కోట్ల పరీక్షలు చేశారని పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 29,12,855 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. కాగా, కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులు వాడడాన్ని తప్పనిసరి చేశాయి.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







