విజిటర్ డబ్బులు చోరీ.. ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా
- July 23, 2022
దుబాయ్: ఒక ఆసియా విజిటర్ నుండి డబ్బులు అపహరించినందుకు దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఇద్దరు ఆసియన్లకు ఒక్కొక్కరికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు సంయుక్తంగా Dhs 50,000 జరిమానా విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషులు బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏప్రిల్లో నమోదైంది. ఒక ఆసియా విజిటర్ తన వద్ద ఉన్న 50,000 సౌదీ రియాల్స్ ను ఎమిరాటీ దిర్హామ్లుగా మార్చుకోవడానికి ఎమిరేట్స్ ID కార్డ్ లేనందున సహాయం చేయమని ఒక ఆసియా వ్యక్తిని కోరాడు. ఇద్దరూ నైఫ్ ప్రాంతంలోని ఒక ఎక్స్ఛేంజ్ ఆఫీసుకు వెళ్లారు. విజిటర్ నుండి 50,000 రియాల్స్ తీసుకొని.. ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ఉద్యోగికి అందజేశారు. ఆ తర్వాత అతడిచ్చిన దిర్హామ్లను అందుకున్న నిందితుడు.. ఎక్స్ఛేంజ్ కార్యాలయం నుంచి పారిపోయాడు. దీంతో విజిటర్ పోలీసులను ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..