కార్మికులు వార్షిక సెలవుల ఫార్వార్డుకు అనుమతి
- July 23, 2022
యూఏఈ: కార్మికుడు లేదా ఉద్యోగి తన వార్షిక సెలవులో సగానికి మించకుండా తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ లేదా నగదు పరిహారం పొందేందుకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) అనుమతి ఇచ్చింది. కార్మికుల పనిగంటలు, కార్యనిర్వాహక నిబంధనలకు సంబంధించి 2021కి సంబంధించిన ఫెడరల్ డిక్రీ లా No33 ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కార్మికుడి కాంట్రాక్టు రద్దయిన సందర్భంలో ప్రాథమిక వేతనానికి అనుగుణంగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన వార్షిక సెలవుల బ్యాలెన్స్కు సమానమైన నగదు భత్యాన్ని తప్పనిసరిగా చెల్లించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికుడు తన వార్షిక సెలవును రెండేళ్లకు మించి తీసుకోకూడదనుకుంటే, లేదా కార్యాలయంలో వర్తించే నిబంధనలకు అనుగుణంగా అతను దాని కోసం నగదు భత్యాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్ట్టైమ్ ఉద్యోగి కూడా వార్షిక సెలవులు పొందడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







