కార్మికులు వార్షిక సెలవుల ఫార్వార్డుకు అనుమతి
- July 23, 2022
యూఏఈ: కార్మికుడు లేదా ఉద్యోగి తన వార్షిక సెలవులో సగానికి మించకుండా తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ లేదా నగదు పరిహారం పొందేందుకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) అనుమతి ఇచ్చింది. కార్మికుల పనిగంటలు, కార్యనిర్వాహక నిబంధనలకు సంబంధించి 2021కి సంబంధించిన ఫెడరల్ డిక్రీ లా No33 ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కార్మికుడి కాంట్రాక్టు రద్దయిన సందర్భంలో ప్రాథమిక వేతనానికి అనుగుణంగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన వార్షిక సెలవుల బ్యాలెన్స్కు సమానమైన నగదు భత్యాన్ని తప్పనిసరిగా చెల్లించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికుడు తన వార్షిక సెలవును రెండేళ్లకు మించి తీసుకోకూడదనుకుంటే, లేదా కార్యాలయంలో వర్తించే నిబంధనలకు అనుగుణంగా అతను దాని కోసం నగదు భత్యాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్ట్టైమ్ ఉద్యోగి కూడా వార్షిక సెలవులు పొందడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









