జపాన్లో బద్ధలైన అగ్నిపర్వతం..
- July 24, 2022
టోక్యో: జపాన్లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. జపాన్ ఉత్తర భాగంలో ఉన్న క్యుషు (సకురజిమా) అనే పర్వత పరిధిలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్ధలైంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం పర్వతం బద్ధలై, లావా ఉప్పొంగుతున్నట్లు జపాన్ వాతావరణ శాఖ (జేఎమ్ఏ) వెల్లడించింది.
దీని ప్రభావం తీవ్రంగా ఉండటతో ఐదో నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు.దీన్ని హై అలర్ట్ కింద పరిగణిస్తారు. ప్రస్తుతం దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు లావాకు చెందిన శిలలు ఎగిసిపడుతున్నాయి. మండుతున్న శిలలు ఎగిరిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రస్తుతం బద్ధలైన అగ్నిపర్వతానికి సమీపంలో కగోషిమా అనే పట్టణం ఉంది. ఇక్కడ దాదాపు ఆరు లక్షల మంది నివసిస్తున్నారు. సకురజిమ జపాన్లో అత్యంత ప్రమాదకర అగ్నిపర్వతం. ఇక్కడ తరచూ లావా బద్ధలవుతుంటుంది. 2019లో 5.5 కిలోమీటర్ల మేర లావా ఎగసిపడింది.
జపాన్ భూభాగం ఎక్కువగా టెక్టానిక్ ప్లేట్స్ పరిధిలో ఉండటంతో ఇక్కడ భూకంపాలు రావడంతోపాటు, అగ్నిపర్వతాలు, సునామీలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే భూకంపాల్లో 20 శాతం జపాన్లోనే నమోదవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







