భారత్ కరోనా అప్డేట్

- July 25, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంది. గడిచిన 24 గంటలో 16,866 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,148 మంది కరోనా నుంచి కోలుకోగా… 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు 4,32,28,670 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 5,26,074 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,17,66,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 16,82,390 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com