రియాధ్ లో అరుదుగా వరదలు... ట్రాఫిక్ గందరగోళం... పాఠశాలలు మూసివెత
- April 13, 2016
సౌదీ రాజధాని రియాధ్ లో అరుదైన తీవ్రమైన తుఫాను బుధవారం ఎడారి నగరంలో వరదలు లేవనెత్తింది ట్రాఫిక్ రద్దీ అధికమవడంతో పాఠశాలలు మూసివేయబడ్డాయి. మంగళవారం సాయంత్రం రద్దీ సమయంలో తుఫాను అలుముకుంది, కానీ ప్రాతః కాలంలో సద్దుమణిగింది కొన్ని రోడ్లు ఇప్పటికీ వరద నీటితో మునిగిపోయాయి. వరదల విపత్తును పరిష్కరించేందుకు రియాద్ తన అత్యవసర ప్రణాళికను అమలుచేయనుందని పురపాలక మండలి ప్రతినిధి మహ్మద్ అల్ శ్వయ్మన్ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ద్వారా చెప్పినట్లు తెలియచేయబడింది. " వరద ప్రభావిత ప్రాంతాల్లో కొందరు స్థానికులు ఫోటోలు మరియు వీడియోలు సేకరించడానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని దీని కారణంగా వారి జీవితాలను వారే ప్రమాదంలోనికి నెట్టుకోవడం సరికాదని " ఆయన అన్నారు. ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ కనీసం కిలోమీటర్లు పాటు స్తంభించింది. మరియు అనేక వాహనాల వెల్లువలో చిక్కుకొని విఫలమయ్యాయి. నగర వీధుల్లో వరదలు ప్రవహిస్తున్నాయి.
రియాద్ లోతట్టు ఎడారి నగరంలో 5.7 మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కాబడతాయి. అతి అరుదుగా మాత్రమే వర్షంను వీరు చూస్తారు. ఒక స్థానిక దినపత్రిక రాజధాని ప్రాంతం లో అన్ని పాఠశాలలు బుధవారం మూసివేయనున్నట్లు విద్యశాఖ ఉదాహరించినట్లు పేర్కొంది.
అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) తిలిపిన వివరాల ప్రకారం, నైఫ్ అరబ్ సెక్యూరిటీ సైన్సెస్ విశ్వవిద్యాలయం కూడా తరగతులు రద్దు చేసినట్లు నివేదించింది. " వాతావరణ పరిస్థితుల కారణంగా రాజ్యం యొక్క నైరుతి దిశలో, అసిర్ ప్రాంతంలో తరగతులను నిలిపి వేశారు " ఒక అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









