ఒమన్ కోటలను సందర్శించిన 100,000 మంది

- July 30, 2022 , by Maagulf
ఒమన్ కోటలను సందర్శించిన 100,000 మంది

ఒమన్: నిజ్వా ఫోర్ట్ సందర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉందని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. ఒమన్ సుల్తానేట్లోని వివిధ కోటలను 111,211 మంది సందర్శకులు సందర్శించగా.. నిజ్వా కోటను 55,636 మంది సందర్శించారని పేర్కొంది. గత సంవత్సర కాలంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటలను సందర్శించిన మొత్తం సందర్శకుల సంఖ్య 111,211 మంది కాగా.. 2020తో పోల్చితే సందర్శకుల సంఖ్య 17 శాతం తగ్గిందని వెల్లడించారు. 55,636 మంది నిజ్వా కాజిల్ మొదటి స్థానంలో ఉందని,  16 మంది సందర్శకులతో థర్మాడ్ ఫోర్ట్ చివరి స్థానంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com