ప్రవాస ఫ్యాకల్టీకి 78 మిలియన్ దినార్‌ల సర్వీస్ బెనిఫిట్స్

- August 02, 2022 , by Maagulf
ప్రవాస ఫ్యాకల్టీకి 78 మిలియన్ దినార్‌ల సర్వీస్ బెనిఫిట్స్

కువైట్: 2021-2022 ఆర్థిక సంవత్సరంలో విద్యా మంత్రిత్వ శాఖలోని ప్రవాస ఉపాధ్యాయులకు 78 మిలియన్ దినార్‌లు సర్వీస్ ముగింపు ప్రయోజనాల కింద చెల్లించనున్నట్లు సివిల్ సర్వీస్ బ్యూరో పేర్కొంది. రాజీనామాలు, పదవీ విరమణ చేసిన టీచర్ల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బడ్జెట్ ను సర్దుబాటు చేస్తామని సర్వీస్ బ్యూరో తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖలో తగ్గించాల్సిన ఉద్యోగాల సంఖ్యను సివిల్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయించలేదని, అయితే విద్యాశాఖలోని ఉద్యోగాలను చేర్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రస్తుతం కువైట్ ఉపాధ్యాయులు, ప్రవాసుల నిష్పత్తి 72.5%(63955 మేల్/ఫీమేల్ సిటిజన్ కువైటీ ఫ్యాకల్టీ), 27.5%(24,393 మంది నాన్ కువైటీస్) ఉన్నారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com