అచ్యుతాపురం గ్యాస్ లీక్..కంపెనీ మూసివేతకు ఆదేశాలు: ఏపీ మంత్రి
- August 03, 2022
అమరావతి: ఏపిలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకైలీకై అస్వస్థకు గురైన 95 మంది మహిళా కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. అయితే బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. సీడ్స్ కంపెనీ మూసేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని, సీడ్స్ కంపెనీకి నోటీసులు ఇచ్చామని, తప్పు జరిగితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనని తెలిపారు. ఇదే కంపెనీలో అంతకుముందు కూడా గ్యాస్ లీకైందని మంత్రి వెల్లడించారు.
అప్పుడు ఏసీ డెక్లలో క్రిమి సంహారక మందులు కలవడం వల్ల కాలుష్యం లీకై గ్లోరిఫై పాలీస్ అనే రసాయనం వెలువడినట్లు తెలిసిందని వివరించారు. ఈసారి కారణం నిర్ధారణ కావాల్సి ఉందని అన్నారు.యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వం చర్యా అనేది తేలాలని అన్నారు. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్ లేకపోతే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్కు నమూనాలు పంపుతున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా రసాయనాలు లీకైన సీడ్స్ కంపెనీలో అధికారులు ఇవాళ నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!