జూలైలో 473 ఉల్లంఘనలు.. 2,000 ఫిర్యాదులు: ఖతార్ కార్మిక శాఖ
- August 04, 2022
దోహా: లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లలో జూలై నెలలో 473 ఉల్లంఘనలను గుర్తించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో 3,693 తనిఖీలు నిర్వహించారు. దేశంలో కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి సంబంధించిన చట్టాలు, మంత్రివర్గ నిర్ణయాలకు సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉన్నాయో పర్యవేక్షించడానికి తనిఖీలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపారు. కార్మిక సంబంధాల విభాగానికి 2,232 ఫిర్యాదులు అందాయని, వాటిలో 211 పరిష్కరించబడ్డాయని.. 827 ఫిర్యాదులను కార్మిక వివాదాల పరిష్కార కమిటీలకు సిఫార్సు చేశామని, దాదాపు 1,194 ఫిర్యాదులు ఈ ప్రక్రియలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంత్రిత్వ శాఖకు దాదాపు 4,692 కొత్త రిక్రూట్మెంట్ అభ్యర్థనలు వచ్చాయని, వాటిలో 2,680 ఆమోదించబడ్డాయని.. 2012 తిరస్కరించినట్లు తెలిపింది. జూలై నెలలో వర్క్ పర్మిట్ల కోసం దాదాపు 822 అభ్యర్థనలు వచ్చాయని, ఇందులో పర్మిట్ను పునరుద్ధరించడానికి 287.. కొత్త పర్మిట్ జారీకి 379.. జారీ చేసిన పర్మిట్లను రద్దు కోసం 156 అభ్యర్థనలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







