ఖతార్ లో 13,430 హెక్టార్లకు చేరుకున్న సాగు భూమి
- August 06, 2022ఖతార్: ఖతార్ సాగు భూమి 13,430 హెక్టార్లకు చేరుకుంది. 2021లో 772,829 టన్నుల పండ్లు, కూరగాయలు, ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యవహారాల విభాగం తన సోషల్ మీడియాలో తెలిపింది. 2,766 హెక్టార్లలో సాగు చేయబడిన కూరగాయల ఉత్పత్తి 2021 నాటికి 101,882 టన్నులకు చేరుకుందని పేర్కొంది. 2,703 హెక్టార్లలో 29,933 టన్నుల పండ్లను ఉత్పత్తి చేశారు. దీంతోపాటు 394 హెక్టార్లలో 3,305 టన్నుల ధాన్యాన్ని సాగు చేశారు. అలాగే 2021లో 7,566 హెక్టార్లలో 637,706 టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములు పెరుగుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తి ఖతార్ జాతీయ ఆహార భద్రతా వ్యూహం 2018-2023 విజయాన్ని తెలుపుతోందని వ్యవసాయ విభాగం పేర్కొంది. టేబుల్ గుడ్ల ఉత్పత్తిని 70 శాతానికి, చేపలను 90 శాతానికి, రొయ్యలను 100 శాతానికి, రెడ్ మీట్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?