యూఏఈలో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన షార్జా ఛాంబర్
- August 08, 2022
షార్జా: యూఏఈ తో భారత దేశం వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి అని షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCC) అభిప్రాయ పడింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ పౌర సంబంధాల డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ శట్టాఫ్ మాట్లాడుతూ భారత దేశం తో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ లో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు భారత్ మరియు షార్జా ఛాంబర్ మధ్య కుదిరిన సమగ్రమైన ఏకానమిక్ భాగస్వామ్య ఒప్పందం (CEPA) దోహద పడుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో షార్జా భారత వాణిజ్య ఛాంబర్ అధ్యక్షుడు ప్రదీప్ సురేఖ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు యూఏఈ కీలకమైనది అని సైతం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







