యూఏఈలో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన షార్జా ఛాంబర్
- August 08, 2022
షార్జా: యూఏఈ తో భారత దేశం వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి అని షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCC) అభిప్రాయ పడింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ పౌర సంబంధాల డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ శట్టాఫ్ మాట్లాడుతూ భారత దేశం తో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ లో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు భారత్ మరియు షార్జా ఛాంబర్ మధ్య కుదిరిన సమగ్రమైన ఏకానమిక్ భాగస్వామ్య ఒప్పందం (CEPA) దోహద పడుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో షార్జా భారత వాణిజ్య ఛాంబర్ అధ్యక్షుడు ప్రదీప్ సురేఖ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు యూఏఈ కీలకమైనది అని సైతం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







