యూఏఈలో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన షార్జా ఛాంబర్
- August 08, 2022షార్జా: యూఏఈ తో భారత దేశం వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి అని షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCC) అభిప్రాయ పడింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ పౌర సంబంధాల డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ శట్టాఫ్ మాట్లాడుతూ భారత దేశం తో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ లో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు భారత్ మరియు షార్జా ఛాంబర్ మధ్య కుదిరిన సమగ్రమైన ఏకానమిక్ భాగస్వామ్య ఒప్పందం (CEPA) దోహద పడుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో షార్జా భారత వాణిజ్య ఛాంబర్ అధ్యక్షుడు ప్రదీప్ సురేఖ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు యూఏఈ కీలకమైనది అని సైతం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..