భారత్ కరోనా అప్డేట్

- August 08, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 16,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899కి చేరాయి. ఇందులో 4,34,99,659 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,730 మంది మృతిచెందారు. మరో 1,35,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మరో 41 మంది కరోనాకు బలవగా, 15,549 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 6.14 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.50 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 206.56 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com