ద్వేషాన్ని రెచ్చగొట్టే వైరల్ వీడియోల పట్ల జాగ్రత్త.. బహ్రెయిన్
- August 08, 2022
బహ్రెయిన్: సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అన్ని నిజమైనవి కాకపోవచ్చని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒరిజినల్గా కనిపించే వైరల్ ఫుటేజీలను షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇటీవలివిగా పేర్కొన్న అనేక వీడియో క్లిప్లపై దర్యాప్తు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దర్యాప్తులో చాల మటుకు పాత వీడియోలుగా తేలాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇలాంటి అనేక సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. ఇతరుల దృష్టిని తేలికగా ఆకర్షించేందుకు, వారిని తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి విజువల్స్ తో కూడిన వీడియోలను షేర్ చేస్తుంటారని వివరించింది. ఇలాంటి వీడియోలతో పౌర శాంతికి భంగం కలిగించడం, ఇతరులకు హాని కలిగించే చర్యలు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం









