ద్వేషాన్ని రెచ్చగొట్టే వైరల్ వీడియోల పట్ల జాగ్రత్త.. బహ్రెయిన్
- August 08, 2022
బహ్రెయిన్: సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అన్ని నిజమైనవి కాకపోవచ్చని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒరిజినల్గా కనిపించే వైరల్ ఫుటేజీలను షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇటీవలివిగా పేర్కొన్న అనేక వీడియో క్లిప్లపై దర్యాప్తు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దర్యాప్తులో చాల మటుకు పాత వీడియోలుగా తేలాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇలాంటి అనేక సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. ఇతరుల దృష్టిని తేలికగా ఆకర్షించేందుకు, వారిని తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి విజువల్స్ తో కూడిన వీడియోలను షేర్ చేస్తుంటారని వివరించింది. ఇలాంటి వీడియోలతో పౌర శాంతికి భంగం కలిగించడం, ఇతరులకు హాని కలిగించే చర్యలు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







