ద్వేషాన్ని రెచ్చగొట్టే వైరల్ వీడియోల పట్ల జాగ్రత్త.. బహ్రెయిన్
- August 08, 2022
బహ్రెయిన్: సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అన్ని నిజమైనవి కాకపోవచ్చని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒరిజినల్గా కనిపించే వైరల్ ఫుటేజీలను షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇటీవలివిగా పేర్కొన్న అనేక వీడియో క్లిప్లపై దర్యాప్తు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దర్యాప్తులో చాల మటుకు పాత వీడియోలుగా తేలాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇలాంటి అనేక సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. ఇతరుల దృష్టిని తేలికగా ఆకర్షించేందుకు, వారిని తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి విజువల్స్ తో కూడిన వీడియోలను షేర్ చేస్తుంటారని వివరించింది. ఇలాంటి వీడియోలతో పౌర శాంతికి భంగం కలిగించడం, ఇతరులకు హాని కలిగించే చర్యలు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







