10 మంది ATM మోసగాళ్లపై విచారణ.. పబ్లిక్ ప్రాసిక్యూషన్
- August 08, 2022
రియాద్: అనేక మంది ATM వినియోగదారులను మోసగించిన 10 మంది విదేశీయుల ముఠా నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.ముఠా సభ్యులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్ల తెలిపింది. ఈ ముఠాలో నలుగురు ప్రవాసులతోపాటు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 6 మంది వ్యక్తులు ఉన్నారని తమ దర్యాప్తులో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. సాయం చేస్తామని చెప్పి ATM వినియోగదారులను సదరు నిందితులు మోసం చేశారని వివరించింది. ఏటీఎం వినియోగదారుల రహస్య నంబర్లను సేకరించి.. ఆపై బ్యాంకు కార్డులను మార్పిడి చేసి మోసాలకు పాల్పడ్డారని తెలిపింది. నిందితులపై దర్యాప్తు ప్రక్రియలు పూర్తవుతాయని, ఆపై కేసులను సమర్థ న్యాయస్థానానికి పంపుతామని, వారికి కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. బ్యాకింగ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను నమ్మొద్దని, తమ బ్యాంకింగ్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







