10 మంది ATM మోసగాళ్లపై విచారణ.. పబ్లిక్ ప్రాసిక్యూషన్
- August 08, 2022
రియాద్: అనేక మంది ATM వినియోగదారులను మోసగించిన 10 మంది విదేశీయుల ముఠా నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.ముఠా సభ్యులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్ల తెలిపింది. ఈ ముఠాలో నలుగురు ప్రవాసులతోపాటు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 6 మంది వ్యక్తులు ఉన్నారని తమ దర్యాప్తులో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. సాయం చేస్తామని చెప్పి ATM వినియోగదారులను సదరు నిందితులు మోసం చేశారని వివరించింది. ఏటీఎం వినియోగదారుల రహస్య నంబర్లను సేకరించి.. ఆపై బ్యాంకు కార్డులను మార్పిడి చేసి మోసాలకు పాల్పడ్డారని తెలిపింది. నిందితులపై దర్యాప్తు ప్రక్రియలు పూర్తవుతాయని, ఆపై కేసులను సమర్థ న్యాయస్థానానికి పంపుతామని, వారికి కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. బ్యాకింగ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను నమ్మొద్దని, తమ బ్యాంకింగ్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









