మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- August 09, 2022బహ్రెయిన్: మద్యం మత్తులో బహ్రెయిన్ మహిళ పోలీసుపై దాడి చేసిన ఒక మహిళ(GCC జాతీయురాలు)కి హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దాంతోపాటు ఆమెకు BD100 జరిమానాను కోర్టు విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ బీచ్లో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందగానే ఓ మహిళ పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు స్విమ్సూట్ ధరించి మద్యం మత్తులో ఉన్నారు. వారిని సెక్యూరిటీ డైరెక్టరేట్కు తీసుకువెళ్లే సమయంలో మహిళ పోలీసును దుర్భాషలాడారు. అలాగే డైరెక్టరేట్ కార్యాలయానికి రాగానే ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెని పట్టుకునేందుకు యత్నించిన మహిళ పోలీసుపై దాడికి పాల్పడింది. నిందితురాలి దాడిలో మహిళ పోలీసుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో దాడికి పాల్పడ్డ నిందితురాలిని కోర్టు దోషిగా నిర్ధారించి జైలుశిక్ష, ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..