ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- August 09, 2022
దోహా: గత వారం రోజుల్లో దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఓ నివేదికను విడుదల చేసింది. గత ఏడు రోజుల్లో కరోనా కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని తెలిపింది. గత 24 గంటల్లో(ఆగస్టు 8) కమ్యూనిటీ కేసుల సంఖ్య 712 కేసులు (107 ప్రయాణికుల కేసులు) నమోదైనట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం.. రోజువారీ సగటు కేసులు 681కాగా.. ప్రయాణికులలో రోజువారీ సగటు రోజువారీ కేసులు 106గా ఉన్నది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,217 ఉండగా.. ఖతార్లో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 415,129గా ఉన్నది. ఇందులో 408,231 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం మరణించినవారి సంఖ్య 681గా ఉంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు 7,339,048 మందికి టీకాలు(1,836,078 బూస్టర్ డోసులు) అందించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







