మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- August 09, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో బహ్రెయిన్ మహిళ పోలీసుపై దాడి చేసిన ఒక మహిళ(GCC జాతీయురాలు)కి హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దాంతోపాటు ఆమెకు BD100 జరిమానాను కోర్టు విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ బీచ్లో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందగానే ఓ మహిళ పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు స్విమ్సూట్ ధరించి మద్యం మత్తులో ఉన్నారు. వారిని సెక్యూరిటీ డైరెక్టరేట్కు తీసుకువెళ్లే సమయంలో మహిళ పోలీసును దుర్భాషలాడారు. అలాగే డైరెక్టరేట్ కార్యాలయానికి రాగానే ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెని పట్టుకునేందుకు యత్నించిన మహిళ పోలీసుపై దాడికి పాల్పడింది. నిందితురాలి దాడిలో మహిళ పోలీసుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో దాడికి పాల్పడ్డ నిందితురాలిని కోర్టు దోషిగా నిర్ధారించి జైలుశిక్ష, ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు