మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- August 09, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో బహ్రెయిన్ మహిళ పోలీసుపై దాడి చేసిన ఒక మహిళ(GCC జాతీయురాలు)కి హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దాంతోపాటు ఆమెకు BD100 జరిమానాను కోర్టు విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ బీచ్లో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందగానే ఓ మహిళ పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు స్విమ్సూట్ ధరించి మద్యం మత్తులో ఉన్నారు. వారిని సెక్యూరిటీ డైరెక్టరేట్కు తీసుకువెళ్లే సమయంలో మహిళ పోలీసును దుర్భాషలాడారు. అలాగే డైరెక్టరేట్ కార్యాలయానికి రాగానే ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెని పట్టుకునేందుకు యత్నించిన మహిళ పోలీసుపై దాడికి పాల్పడింది. నిందితురాలి దాడిలో మహిళ పోలీసుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో దాడికి పాల్పడ్డ నిందితురాలిని కోర్టు దోషిగా నిర్ధారించి జైలుశిక్ష, ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







