మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- August 09, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో బహ్రెయిన్ మహిళ పోలీసుపై దాడి చేసిన ఒక మహిళ(GCC జాతీయురాలు)కి హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దాంతోపాటు ఆమెకు BD100 జరిమానాను కోర్టు విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ బీచ్లో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందగానే ఓ మహిళ పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు స్విమ్సూట్ ధరించి మద్యం మత్తులో ఉన్నారు. వారిని సెక్యూరిటీ డైరెక్టరేట్కు తీసుకువెళ్లే సమయంలో మహిళ పోలీసును దుర్భాషలాడారు. అలాగే డైరెక్టరేట్ కార్యాలయానికి రాగానే ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెని పట్టుకునేందుకు యత్నించిన మహిళ పోలీసుపై దాడికి పాల్పడింది. నిందితురాలి దాడిలో మహిళ పోలీసుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో దాడికి పాల్పడ్డ నిందితురాలిని కోర్టు దోషిగా నిర్ధారించి జైలుశిక్ష, ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !