తనను తాను పేల్చుకున్న నిందితుడు.. నలుగురికి గాయాలు
- August 13, 2022
సౌదీ: అరెస్టు సమయంలో నిందితుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయినట్లు భద్రతా అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెడ్డా గవర్నరేట్లోని అల్-సమేర్ జిల్లాలో నిందితుడయిన సౌదీ జాతీయుడు అబ్దుల్లా బిన్ జైద్ అబ్దుల్రహ్మాన్ అల్-బక్రీ అల్-షిహ్రీని వెంబడిస్తున్న క్రమంలో అతను తాను ధరించిన పేలుడు బెల్ట్ను పేల్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక ప్రవాసుడు, ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయాలయిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా రాజ్యం భూభాగాల్లో పౌరులు, ప్రవాసుల స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా ఎదుర్కోవడానికి రాష్ట్ర భద్రత విభాగం సిద్ధంగా ఉందని భద్రతా అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







