తనను తాను పేల్చుకున్న నిందితుడు.. నలుగురికి గాయాలు
- August 13, 2022
సౌదీ: అరెస్టు సమయంలో నిందితుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయినట్లు భద్రతా అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెడ్డా గవర్నరేట్లోని అల్-సమేర్ జిల్లాలో నిందితుడయిన సౌదీ జాతీయుడు అబ్దుల్లా బిన్ జైద్ అబ్దుల్రహ్మాన్ అల్-బక్రీ అల్-షిహ్రీని వెంబడిస్తున్న క్రమంలో అతను తాను ధరించిన పేలుడు బెల్ట్ను పేల్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక ప్రవాసుడు, ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయాలయిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా రాజ్యం భూభాగాల్లో పౌరులు, ప్రవాసుల స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా ఎదుర్కోవడానికి రాష్ట్ర భద్రత విభాగం సిద్ధంగా ఉందని భద్రతా అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







