లులు హైపర్‌మార్కెట్‌లో ప్రారంభమైన ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్

- August 16, 2022 , by Maagulf
లులు హైపర్‌మార్కెట్‌లో ప్రారంభమైన ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్

మనామా: 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా "ఇండియా ఉత్సవ్" ఫెస్టివల్ ను ప్రారంభించినట్లు గల్లెరియా మాల్‌లోని లులు హైపర్‌మార్కెట్ ప్రకటించింది. ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్ ను బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ప్రారంభ వేడుకలో ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతును ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఫుడ్, పండ్లు, కూరగాయల స్టాల్స్ కిటకిటలాడాయి.ఈ ఫెస్టివల్ అన్ని లులు అవుట్‌లెట్‌లతోపాటు ఆన్‌లైన్ పోర్టల్ (E-com)లో ఆగస్టు 24 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. కొనుగోలుదారులకు భారతదేశ ఉత్సవ్‌ను అందించడం గర్వంగా ఉందని లులు హైపర్‌మార్కెట్స్ ప్రాంతీయ డైరెక్టర్ మహ్మద్ కలీమ్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com