భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్.. తొలి బ్యాచ్ టిక్కెట్ల అమ్మకం పూర్తి
- August 16, 2022
యూఏఈ: ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దీనికి సంబంధించిన తొలి బ్యాచ్ టిక్కెట్ల విక్రయం పూర్తయిందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది. రెండున్నర గంటల్లోపే ప్లాటినం జాబితా టిక్కెట్లన్ని అమ్ముడుపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. త్వరలోనే తదుపరి బ్యాచ్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తామని ఏసీసీ వెల్లడించింది. టిక్కెట్ల కోసం సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల నుండే క్యూలో నిలబడ్డామని.. సాయంత్రం 6 గంటలకు టికెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయని మధ్యాహ్నం నిర్వాహకులు ప్రకటించారని జఫర్ మహమూద్ అనే నివాసి తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు క్యూలో నిలబడ్డా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్ లైన్ కొనుగోళ్లకు టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయని, సైట్ రెండుసార్లు క్రాష్ అయిందని మరో అభిమాని వాపోయాడు. ఇదిలా ఉండగా టిక్కెట్లు పొందిన కొందరు అభిమానులు వాటిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ఒక వ్యక్తి తన వద్ద నాలుగు టిక్కెట్లు ఉన్నాయని ట్విట్లర్ వేదికగా పోస్ట్ చేశాడు. దీనిపై నిర్వాహకులు స్పందించారు. టికెట్లను తిరిగి అమ్మడాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. ఇతరుల నుంచి కొన్న టిక్కెట్లు చెల్లవని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







