బహ్రెయిన్ లో ఐఐటీ మద్రాస్ పరీక్షా కేంద్రం
- August 16, 2022
బహ్రెయిన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ “BS ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్” ఆన్లైన్ బ్యాచిలర్ ప్రోగ్రామ్ కోసం బహ్రెయిన్లో తన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం వర్చువల్గా రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. బహ్రెయిన్లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ముఖ్యవక్తగా పాల్గొంటారు.ఐఐటీ మద్రాస్ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విఘ్నేష్ ముత్తువిజయన్, బహ్రెయిన్ పరీక్షా కేంద్రం డైరెక్టర్ అబ్దుల్ జలీల్ అబ్దుల్లా హాజరుకానున్నారు. బహ్రెయిన్లో నివసిస్తున్న విద్యార్థులు IIT బ్యాచిలర్ డిగ్రీని సాధించడానికి ఇది మంచి అవకాశం అని అబ్దుల్ జలీల్ అబ్దుల్లా తెలిపారు. IIT బ్యాచిలర్స్, NPTEL, JEE మెయిన్, CUET, ACCA CBE, NIOS, NATA, Tally మొదలైన ప్రధాన పోటీ పరీక్షలకు లారెల్స్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వేదికగా మారుతున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. మరింత సమాచారం, మీటింగ్ లింక్ కోసం 33644193 లేదా 33644194 WhatsApp నంబర్లలో గ్లోబల్ ఎడ్యుకేషన్ను సంప్రదించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







