ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురికి జైలు శిక్ష

- August 19, 2022 , by Maagulf
ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురికి జైలు శిక్ష

దుబాయ్: ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురిని దుబాయ్ దుర్వినియోగాలు, ఉల్లంఘనల కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒక ఆసియన్ షిప్ కెప్టెన్(43), మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నిందితులకు ఒక నెల జైలు శిక్షతోపాటు మూడు సంవత్సరాల ఉద్యోగ సస్పెన్షన్‌ను కోర్టు విధించింది. ప్రమాదంలో ఓడకు జరిగిన నష్టానికి Dh100,000 జరిమానా విధించింది. దీనితోపాటు వారి కేసును దుబాయ్ సివిల్ కోర్టుకు రిఫర్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జెబెల్ అలీ పోర్ట్‌లోని ఓడలో మంటలు చెలరేగి 24 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని కోర్టు పేర్కొంది. గతేడాది జూలైలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్‌లోని ఎన్విరాన్‌మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ నిర్దేశించిన భద్రతా చర్యలను పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com