విద్యార్థులకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలి: ఖతార్
- August 19, 2022
దోహా: 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల ప్రారంభానికి గరిష్ఠంగా 48 గంటల ముందు కోవిడ్-19 రాపిడ్ యాంటిజెన్ పరీక్షను (ఒక్కసారి మాత్రమే) చేయించుకోవాలని విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఫలితాల్లో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే పాఠశాల ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాఠశాల ఆరోగ్య సేవల విభాగం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం సమన్వయంతో వారి విద్యార్థులందరికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లను అందించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలు, కిండర్ గార్టెన్ల ప్రిన్సిపాల్లకు మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. యాంటిజెన్ పరీక్షల సమయాలను తెలుపుతూ తల్లిదండ్రులకు SMS సందేశాలను పంపాలని పాఠశాలలకు సూచించారు. ఆగస్ట్ 21 నుంచి పాఠశాలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







