దుబాయ్ లాటరీలో 50లక్షల దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు

- August 19, 2022 , by Maagulf
దుబాయ్ లాటరీలో 50లక్షల దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు

దుబాయ్‌: దుబాయ్‌లో మరో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది.దీంతో 50లక్షల దిర్హాములుగెలుచుకున్నాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన షాన్వాజ్‌ 15 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గడిచిన ఏడాదిన్నరగా దుబాయ్ ఆన్‌లైన్ లాటరీలో పాల్గొంటున్నాడు. ఇటీవల షాన్వాజ్ కొనుగోలు చేసిన  7, 9, 17, 19, 21 నంబర్ సిరీస్‌కు తాజాగా జాక్‌పాట్ తలిగింది. దీంతో మొదటి ప్రైజ్ కింద 50లక్షల దిర్హాములు గెలుచుకున్నాడు. ఇంతా భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల షాన్వాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ నగదులో కొంత మొత్తం తన అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తానని చెప్పిన షాన్వాజ్.. మిగిలిన సొమ్ముతో దుబాయ్‌లో బిజినెస్ ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే లాటరీలో మరో ఇద్దరు విదేశీయులు కూడా చెరో 50లక్షల దిర్హాములు గెలుచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com