ఆసుపత్రిలో పరిమితం కానున్న రోగుల సందర్శకులు

- August 20, 2022 , by Maagulf
ఆసుపత్రిలో పరిమితం కానున్న రోగుల సందర్శకులు

మస్కట్: సోహార్ ఆసుపత్రిలో రోగుల సందర్శకులు ఫస్ట్ డిగ్రీ బంధువులకు మాత్రమే పరిమితం చేయనున్నారు.

సోహార్ హాస్పిటల్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది: ఆసుపత్రి పరిపాలన రోగులు మరియు సందర్శకుల తాఖిడి తగ్గించేలా చర్యలు చేపట్టడంతో  ఆగష్టు 21, 2022 నుండి, ఇన్‌పేషెంట్‌ల సందర్శనలు ఫస్ట్-డిగ్రీ బంధువులకు మాత్రమే పరిమితం చేయబడతాయి. ఆసుపత్రికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.  

అలాగే, ఔట్ పేషెంట్ క్లినిక్‌లకు హాజరయ్యే రోగులకు, రోగికి అవసరమైనప్పుడు ఒక సహచరుడు మాత్రమే అనుమతించబడతారు. వారి సహకారం మరియు సమాజ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నందుకు మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com