చెన్నై-దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు
- August 27, 2022
చెన్నై: చెన్నై నుంచి శనివారం ఉదయం దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానంలో బాంబు ఉందంటూ చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ రావడంతో్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.చెన్నై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి శనివారం ఫోన్ కాల్ వచ్చింది.దీంతో పోలీసులు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కనుగొనడానికి విచారణ ప్రారంభించారు. విమానంలో బాంబు కాని పేలుడు పదార్థాలు కాని అమర్చారా అనే విషయాన్ని నిర్ధరించడానికి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.తదనంతరం 160 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం లోపల భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







