చెన్నై-దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు
- August 27, 2022
చెన్నై: చెన్నై నుంచి శనివారం ఉదయం దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానంలో బాంబు ఉందంటూ చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ రావడంతో్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.చెన్నై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి శనివారం ఫోన్ కాల్ వచ్చింది.దీంతో పోలీసులు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కనుగొనడానికి విచారణ ప్రారంభించారు. విమానంలో బాంబు కాని పేలుడు పదార్థాలు కాని అమర్చారా అనే విషయాన్ని నిర్ధరించడానికి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.తదనంతరం 160 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం లోపల భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







