చెన్నై-దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు

- August 27, 2022 , by Maagulf
చెన్నై-దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు

చెన్నై: చెన్నై నుంచి శనివారం ఉదయం దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానంలో బాంబు ఉందంటూ చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ రావడంతో్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.చెన్నై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి శనివారం ఫోన్ కాల్ వచ్చింది.దీంతో పోలీసులు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కనుగొనడానికి విచారణ ప్రారంభించారు. విమానంలో బాంబు కాని పేలుడు పదార్థాలు కాని అమర్చారా అనే విషయాన్ని నిర్ధరించడానికి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.తదనంతరం 160 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం లోపల భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com