ఇరాక్లో కాల్పుల కలకలం..15 మంది మృతి
- August 30, 2022
బాగ్దాద్: ఇరాక్ లో ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో రాజధాని బాగ్దాద్లో కాల్పులు కలకలం రేపాయి. ముక్తాదా ప్రకటన వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్యాలెస్పై వందలాది మంది నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ గోడలను బద్దలు కొట్టి.. భవనంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు.
తాజా ఘటనతో దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ విధించింది. కేబినెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. గతేడాది అక్టోబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అల్-సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. షియా వ్యతిరేక వర్గాలతో మంతనాలు జరిపేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు.చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో రాజకీయం వేడెక్కింది.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







