ఉద్యోగుల సెకండ్మెంట్ అభ్యర్థనలకు ఇ-సర్వీసులు ప్రారంభం
- September 01, 2022
ఖతార్: ఉద్యోగుల సెకండ్మెంట్ అభ్యర్థనల కోసం కొత్త ఇ-సేవను ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. ఈ సేవ ప్రక్రియలను వేగవంతం చేయడం, లావాదేవీలను పారదర్శకంగా పూర్తి చేయడానికి డిజిటల్ పరివర్తన వ్యూహంలో భాగంగా ఈ సర్వీసును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త సేవ ప్రస్తుత యజమానిని మార్చాల్సిన అవసరం లేకుండా మరొక కంపెనీ లేదా సంస్థకు కార్మికుల సెకండ్మెంట్ కోసం అభ్యర్థనలను సమర్పించడానికి కూడా అనుమతిస్తుందని పేర్కొంది. అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత ఉద్యోగులు కొత్త కంపెనీలో పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ పని చేసుకోవచ్చు.ఈ సేవ ప్రస్తుత యజమాని ఆమోదానికి లోబడి ఉంటుందని, వర్కర్ సెకండ్ చేయబడిన కంపెనీ కూడా పూర్తిగా రిజిస్టర్ చేయబడి ఉండాలని, 2004 నాటి లేబర్ లా నం. 14 నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెకండ్మెంట్ వ్యవధి గరిష్టంగా ఆరు నెలలు మించకూడదని, అలాగే ఉద్యోగి నివాస అనుమతి గడువు తేదీని కూడా మించకూడదని వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, ప్రజలు https://www.mol.gov.qa/ar/pages/default.aspx వెబ్సైట్ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







