గో సంరక్షణ రాయబారిగా కిచ్చా సుదీప్..
- September 03, 2022
బెంగుళూరు: మన దేశంలో ఆవుల్ని దేవతల్లా పూజిస్తాం. ఈ నేపథ్యంలో ఆవుల్ని రక్షించడానికి పలు కార్యక్రమాల్ని కూడా చేపడతారు. గో సంరక్షకుల పేరుతో ఆవుల్ని రక్షించడానికి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుంటుంది. అక్కడ గో సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. తాజాగా గో సంరక్షణ రాయబారిగా కన్నడ స్టార్ హీరో సుదీప్ను ఎంపిక చేసినట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు.
పశుపాలనకు, గో సంరక్షణకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన పుణ్యకోటి దత్తు యోజన అనే కార్యక్రమానికి రాయబారిగా సుదీప్ ని ఎంపిక చేశారు. ఈ మేరకు సుదీప్కు లేఖ రాసి అభినందనలు తెలిపారు. శుక్రవారం సుదీప్ పుట్టిన రోజు కావడంతో అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వార్తని ప్రకటించారు. గో సంరక్షణ రాయబారిగా సుదీప్ రాకతో ఆ శాఖకు, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. గో రక్షకులు, సుదీప్ అభిమానులు ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









